ప్రైవేట్ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

by  |
ganji prabhakar
X

దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి బిల్డింగ్ ఐదో అంతస్తు పైనుంచి దూకి గంజి ప్రభాకర్(48) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 06 : 30 గంటలకు చోటుచేసుకుంది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.


Next Story