శ్మశాన వాటికలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.. ఎందుకంటే..?

by  |
శ్మశాన వాటికలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.. ఎందుకంటే..?
X

దిశ, కాజీపేట: కాజీపేటలోని హిందూ శ్మశాన వాటికలో సోమవారం గొర్రె సమ్మయ్య (60) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని కాజీపేట పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబానికి వారి బంధువులతో గొడవలు జరగగా ఇరువర్గాలపై పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సమ్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ దొరికిందని, మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story