అది తట్టుకోలేక రైలు క్రింద పడి యువకుడు ఆత్మహత్య..

by  |
venkatesh
X

దిశ, గద్వాల: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గద్వాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీకి చెందిన ఎంగలి వెంకటేష్ (22) అనే వ్యక్తి డ్రై ఫ్రూట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఒత్తిడికి గురి అయి గురువారం రాత్రి గద్వాల పట్టణ శివార్లలో ఎస్.వి.ఈవెంట్ గార్డెన్ వెనుక గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed