అన్న ప్రాసనకు వెళ్లి.. బీరుసీసాకు బలి

by  |
అన్న ప్రాసనకు వెళ్లి.. బీరుసీసాకు బలి
X

దిశ, వెబ్‌డెస్క్ : అన్న ప్రాసనకు వెళ్లిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సూర్యపేట మండలం తాళ్ల కంపాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. అన్న ప్రాసన కార్యక్రమానికి నవీన్ అనే వ్యక్తి తన చిన్ననాటి మిత్రులను ఆహ్వానించాడు. దీంతో మిత్రుడి పిలుపు మేరకు చివ్వేంలకు చెందిన మహేష్, సూర్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన గడ్డం పవన్‌ను నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం మిత్రులకు నవీన్ మందు పార్టీ ఏర్పాటు చేశాడు. మందు పార్టీలో మాటల మధ్య మహేష్, పవన్‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆవేశానికి లోనైన మహేష్ బీరు సీసాతో పవన్‌ను పొడిచాడు. తీవ్ర గాయాలు అయిన పవన్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story