మామిడిపల్లి శివారులో దారుణహత్య.. చేసిందెవరు..?

by Batti.Sumithra |

<p>దిశ, ఆర్మూర్: మాక్లూర్ మండలం మామిడిపల్లి శివారులో దారుణం జరిగింది. ఓ యువకుడిని అతి కిరాతకంగా హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. ఐదు, ఆరు రోజుల క్రితమే హత్య జరిగినట్టు తెలుస్తున్నది. ఈ నెల 1వ తేదీన ఓ మొరం వ్యాపారి ఇచ్చిన సమాచారం మేరకు మాక్లూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు బోధన్‌కు మండలం జమల్‌పూర్‌కు చెందిన సాయితేజ (22)గా విచారణలో వెల్లడైంది. హత్య చేసింది ఎవరు.. ఇక్కడే చంపి పడేశారా, చంపేసి తీసుకొచ్చారా [&hellip;]</p>

మామిడిపల్లి శివారులో దారుణహత్య.. చేసిందెవరు..?
X

దిశ, ఆర్మూర్: మాక్లూర్ మండలం మామిడిపల్లి శివారులో దారుణం జరిగింది. ఓ యువకుడిని అతి కిరాతకంగా హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. ఐదు, ఆరు రోజుల క్రితమే హత్య జరిగినట్టు తెలుస్తున్నది. ఈ నెల 1వ తేదీన ఓ మొరం వ్యాపారి ఇచ్చిన సమాచారం మేరకు మాక్లూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు బోధన్‌కు మండలం జమల్‌పూర్‌కు చెందిన సాయితేజ (22)గా విచారణలో వెల్లడైంది. హత్య చేసింది ఎవరు.. ఇక్కడే చంపి పడేశారా, చంపేసి తీసుకొచ్చారా అనేది తెలియాల్సి ఉంది. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story