దారుణం.. పరస్పరం కత్తులతో దాడిచేసుకున్న రెండు కుటుంబాలు

by  |
దారుణం.. పరస్పరం కత్తులతో దాడిచేసుకున్న రెండు కుటుంబాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : జోగులాంబ గద్వాల జిల్లా పూడూరులో దారుణం చోటు చేసుకుంది. వివాదాస్పద స్థలంలో గుడిసెలు వేసుకునే విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు నరికి చంపారు. అనంతరం మృతుని బంధువులు ప్రత్యర్ధులపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రున్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed