- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: మాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టి, తెలుగులోనూ అగ్రహీరోల సరసన నటించిన హీరోయిన్ మమతా మోహన్ దాస్. అమ్మడు కొంతకాలంగా పూర్తిగా మలయాళం సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి ‘ఎనిమీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఈ క్రమంలో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు హాజరైంది.
ఈ నేపథ్యంలో మమత మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత తెలుగు వేదికపైకి వచ్చాను. ఇక్కడ పనిచేసి 10 సంవత్సరాలు దాటింది. దీంతో తెలుగు మాట్లాడటం కూడా మరిచిపోయాను. తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతే ఏమీ అనుకోకండి. ముందుగా ఈ ఈవెంట్ వేదికగా పునీత్ రాజ్ కుమార్కు నివాళులు అర్పిస్తున్నాను’ అని తెలిపింది.
అలాగే ‘ఎనిమీ సినిమా విషయానికి వస్తే ముందుగా దర్శకుడు ఆనంద్ శంకర్ గారికి కృతజ్ఞతలు. ఇందులో నా పాత్ర చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత నేను తెలుగులో చేస్తున్న సినిమా ఇది. కాబట్టి చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. మళ్లీ తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీపావళి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తప్పకుండా అందరూ ఫ్యామిలీతో వెళ్లి చూడండి’ అని ముగించింది. ఈ విషయం తెలుసుకున్న మమతా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.