షెడ్యూల్‌పై మమత అసంతృప్తి.. అందుకే అలా చేశారా అని మండిపాటు

by  |
షెడ్యూల్‌పై మమత అసంతృప్తి.. అందుకే అలా చేశారా అని మండిపాటు
X

దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల షెడ్యూల్‌పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంసతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఒకే జిల్లాలో మూడు విడతల పోలింగ్ ఎందుకు. మాకు బలమున్న 24 పరగణాల జిల్లాలో 3 విడతలు ఎందుకు. మోడీ, అమిత్ షా సౌలభ్యం కోసమే ఇలా చేశారా. మోడీ, అమిత్ షాల అధికార దుర్వినియోగం మంచిది కాదు. అధికార దుర్వినియోగం చేస్తే ఫలితం అనుభవిస్తారు. భాజాపా ఇప్పటికే అన్ని జిల్లాలకు భారీగా డబ్బులు పంపింది. బీజేపీ డబ్బు పంపిణీని ఈసీ అడ్డుకోవాలి’ అని అన్నారు.

Next Story

Most Viewed