ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా టీజీవో అధ్యక్షురాలు మమత

by  |
Mamatha-12
X

దిశ, ఎల్బీనగర్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఆయా జోన్ల జెడ్సీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నూతన జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా వి. మమత నియమితులయ్యారు. జీహెచ్ఎంసీ కూకట్ పల్లి జోనల్ క‌మిష‌న‌ర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతను ఎల్బీనగర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఇక్కడ జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఉపేందర్ రెడ్డి నల్గొండ మున్సిపల్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీపై వెళ్లారు. బుధవారం వి. మమత జెడ్సీగా బాధ్యతలు స్వీక‌రించ‌నున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) అధ్యక్షురాలిగా మమత కొనసాగుతున్నారు.

Next Story

Most Viewed