Pegasus :పెగాసెస్ వివాదంపై దీదీ సంచలన వ్యాఖ్యలు

by  |
Pegasus :పెగాసెస్ వివాదంపై దీదీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పెగాసెస్ వివాదంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆమె.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గూఢచర్యం కోసం కోట్లాది రూపాయలను మోదీ వెచ్చిస్తున్నారని మమత ఆరోపించారు.

‘మీడియా, న్యాయ, ఎన్నికల కమిషన్‌ను పెగాసెస్ ఆక్రమించుకుందని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రానికి నిధులు ఇవ్వడానికి చేతులు రావు. కానీ స్పైవేర్ల కోసం మాత్రం కోట్లు ఖర్చు చేస్తున్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలి’ అని మమత డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed