మల్లన్నసాగర్ ముంపు బాధితుడు ఆత్మహత్యాయత్నం

by  |
మల్లన్నసాగర్ ముంపు బాధితుడు ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో మల్లన్నసాగర్ ముంపు బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో ముంపు బాధితుడు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించింది. పునరావాస పరిహారం అందలేని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపించాడు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని కొండపాక మండలం సింగారం వాసి అజీజ్ పాషాగా గుర్తించారు.



Next Story

Most Viewed