దాతలు ముందుకు రావాలి

by  |
దాతలు ముందుకు రావాలి
X

దిశ, మేడ్చల్: లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్‌ బోయిన్‌పల్లి సదాశివ హైస్కూల్ ఆవరణలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్, కమిషనర్ మమత పాల్గొన్నారు.

slug; mallareddy distribute the daily needs to poor people


Next Story

Most Viewed