కరోనా ఎఫెక్ట్: అక్కడకు నో ఎంట్రీ.. షాక్ లో సెలబ్రెటీలు

by  |
కరోనా ఎఫెక్ట్: అక్కడకు నో ఎంట్రీ.. షాక్ లో సెలబ్రెటీలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాల్దీవులు.. సెలబ్రెటీలు సేద తీరే అద్భుతమైన ప్లేస్. ఇక ఇటీవలే పలువురు సెలబ్రెటీలు తమ కుటుంబాలతో మాల్దీవుల్లో వాలిపోయి ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ.. అక్కడి ఫోటోలను సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకున్నారు. కరోనా నుండి తప్పించుకోవడానికి ఇక నుండి ఎవరైనా మాల్దీవువులకు వెళ్లాలనుకొంటే.. కుదురదు. ఎందుకంటే కరోనా కారణంగా ఇండియన్స్ కి మాల్దీవులు నో ఎంట్రీ బోర్డు పెట్టేశాయి. ఇండియాలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మాల్దీవుల్లో ఎంట్రీకి ఆ దేశం నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఇండియా తో పాటు దక్షిణాసియా దేశాల నుండి వచ్చే పర్యాటకులపై నిషేధం విధించినట్టు తెలిపింది. ఇక మాల్దీవుల్లో ఇప్పటికే ఉన్న ఇండియన్స్ని స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని భారత రాయబార కార్యాలయానికి అధికారులు సూచించారు. ఇక మాల్దీవుల్లో ఎంజాయ్ చేయాలన్న సెలబ్రెటీలు కార్న్ ఆ తగ్గేవరకు ఇండియా లో ఉండక తప్పదు.



Next Story