- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పరకాల : ఉమ్మడి వరంగల్ జిల్లా వరికోల్ గ్రామస్తులకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం వరికోల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే బతుకమ్మ పండుగ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
దీనికి హాజరై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరీ కోరిక మేరకు ఒకే దగ్గర డబుల్ ఇళ్ల నిర్మాణం చేశామన్నారు. అందుకు 6 ఎకరాల స్థలం విరాళంగా అందజేసిన పోచంపల్లి శ్రీనివాస రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెలలోనే వీలైనంత తొందరగా మంచి ముహూర్తం చూసి అర్హులకు గృహాలను పంపిణీ చేస్తామని స్పష్టంచేశారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వైస్ ఎంపీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story