కేసీఆర్‌‌ను తిడితే నాలుక కోస్తాం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

by  |
కేసీఆర్‌‌ను తిడితే నాలుక కోస్తాం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, మక్తల్: తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొందరు నాయకులు పనిగట్టుకుని తిడుతున్నారని.. ఆ నాయకుల నాలుకలను కోస్తామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి కేసీఆర్‌ను వ్యంగ్య పదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు ఎవరూ సహించరని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం ఉన్నత పదవుల్లో ఉన్న వారిని విమర్శించడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, అమర్ మార్కెట్ చైర్మన్, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed