12 కార్లు.. నలుగురు వ్యక్తులు.. క్షణాల్లో స్మాష్

by  |
12 కార్లు.. నలుగురు వ్యక్తులు.. క్షణాల్లో స్మాష్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మపురి జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. బెంగుళూరు జాతీయ రహదారిపై అదుపుతప్పిన లారీ ఎదురుగా వస్తున్న కార్లపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 కార్లు నుజ్జునుజ్జు కాగా, 15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. రోడ్డు ప్రమాదంలో మొత్తం నలుగురు మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అంతేగాకుండా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed