కశ్మీర్‌లోని మార్కెట్‌లో అగ్నిప్రమాదం.. 20 షాపులు దగ్ధం

by  |
కశ్మీర్‌లోని మార్కెట్‌లో అగ్నిప్రమాదం.. 20 షాపులు దగ్ధం
X

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని ఓ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 షాపులు కాలి బూడిదయ్యాయి. ఈ రోజు (సోమవారం) ఉదయం సోపోర్‌లో వాటర్గామ్‌లోని మార్కెట్‌లో ఈ ఘటన సంభవించింది. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో మరణాలు నమోదుకాలేదు.


Next Story