- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, మేడ్చల్ : హఠాత్తుగా గుండెపోటుతో నేలకొరిగిన మల్కాజ్గిరి పాత్రికేయుడు శ్రీనివాస్ కుటుంబాన్ని బుధవారం స్థానిక శాసన సభ్యులు మైనంపల్లి హన్మంత రావు, టీయూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి తన సానుభూతి తెలిపి ఓదార్చారు.
మృతుడు శ్రీనివాస్ పిల్లలిద్దరికీ చెరో లక్ష రూపాయల చొప్పున మైనంపల్లి తన వ్యక్తిగత ఆర్థిక సహకారాన్ని ప్రకటించారు. దీంతో పాటుగా ఇద్దరు పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్తో మాట్లాడి డబుల్ బెడ్ రూం ఇల్లును మంజూరు చేస్తానని భరోసానిచ్చారు. మృతుడి భార్యకు ఏదైనా ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచిన మైనంపల్లి హన్మంత రావుకు టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా శాఖ అధ్యక్షుడు మోతె వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బాల్ రాజ్, సహాయ కార్యదర్శి వెంకటేష్, యూనియన్ కాప్రా, మల్కాజిగిరి నాయకులు విజయ్, తేజ, మహేష్, లక్ష్మారెడ్డి, మల్లేష్ గౌడ్, పవన్, మనోహర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.