ప్రిన్స్.. గురూజీకి ఓకే చెప్పాడా?

by  |
ప్రిన్స్.. గురూజీకి ఓకే చెప్పాడా?
X

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుందా? అంటే ఇండస్ట్రీ నుంచి ఔననే సమాధానం వినిపిస్తోంది. ‘ఖలేజా, అతడు’ సినిమాలకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరు.. హ్యాట్రిక్ మూవీ ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఖలేజాతో మహేశ్‌లోని కామెడీ యాంగిల్‌ను పరిచయం చేసిన గురూజీ.. బాక్సాఫీసు దగ్గర ఫెయిలైనా సరే ఆ సినిమాకు, సినిమాలో మహేశ్ కామెడీ టైమింగ్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక ‘అతడు’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే ప్రిన్స్‌ను కలిసిన గురూజీ.. కథ కూడా వినిపించాడని సమాచారం. మహేశ్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుండగా.. ‘సర్కార్ వారి పాట’ పూర్తి కాగానే ఈ సినిమా ఉండబోతుందని టాక్. అటు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ మూవీ కంప్లీట్ చేసి, మహేశ్ మూవీపై కాన్సంట్రేట్ చేయాలి. మొత్తానికి ఎస్‌ఎస్. రాజమౌళి, మహేశ్ కాంబినేషన్‌లో సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఈ చిత్రం పూర్తి కావాల్సి ఉంటుంది.

Next Story