బాలీవుడ్ అప్‌డేట్: రాముడిగా మహేశ్.. మరి ప్రభాస్?

by  |
బాలీవుడ్ అప్‌డేట్: రాముడిగా మహేశ్.. మరి ప్రభాస్?
X

దిశ, సినిమా: ప్రముఖ నిర్మాత మధు మంతెన నిర్మాణంలో ‘రామాయణ’ 3డి చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీపికా పదుకొనే సీత పాత్రకు కన్‌ఫర్మ్‌ కాగా, రావణుడిగా హృతిక్ రోషన్ నటించబోతున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను రాముడి పాత్రలో తీసుకోవాలని మధు మంతెన అనుకున్నా.. ఈలోపే డైరెక్టర్ ఓమ్ రౌత్ రామాయణ కథాంశంతో ‘ఆదిపురుష్’ తెరకెక్కిస్తున్నానని ప్రకటించడం, ఇందులో ప్రభాస్‌ను రామచంద్రుడిగా చూపించబోతున్నామని అనౌన్స్ చేయడం జరిగిపోయింది. లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్న ఈ చిత్రంలో కృతి సనన్ సీతమ్మగా నటించబోతోంది.

కాగా ఓమ్ రౌత్ ‘ఆదిపురుష్’ అనౌన్స్‌మెంట్‌తో షాక్ అయిన మధు మంతెన.. తను ఎప్పటినుంచో అనుకుంటున్న ‘రామాయణ’ 3డి ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలనే యోచనలో ఉన్నారట. ఈ క్రమంలో ప్రభాస్‌ను రీప్లేస్ చేసే సౌత్ స్టార్ కోసం వెతుకుతుండగా, సూపర్ స్టార్ మహేశ్ బాబు అయితే రాముడి పాత్రలో ఉన్న ఇన్నోసెన్స్‌ను వందశాతం చూపించగలడని అనుకున్నారట మధు. వెంటనే మహేశ్‌ను ఈ రోల్ గురించి సంప్రదించగా.. ఆయన స్క్రిప్ట్ నచ్చిందని చెప్పినప్పటికీ, ఇంకా ప్రాజెక్ట్‌కు సైన్ చేయాల్సి ఉంది.


Next Story

Most Viewed