- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి నేను పెద్ద అభిమానిని అని, మైదానంలో ఒత్తిడిని అధిగమించే తీరే నన్ను అతని అభిమానిగా మార్చిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. భారత క్రికెట్కు ధోనీ దొరకడం తనకు చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నాడు. పుట్టినరోజు నేపథ్యంలో మహీపై గంగూలీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘2004లో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో ధోనీని ఎంపిక చేయాలని సెలెక్టర్లను కోరాను. కానీ, ఒక కెప్టెన్గా నేను జట్టును మాత్రమే ఎంచుకోగలను. నేను జట్టులోకి తీసుకున్న ధోనీ ఆ మ్యాచ్లో విఫలమయ్యాడు. కానీ, అతని ఆటతీరుపై నాకు నమ్మకముంది. అందుకే పాకిస్తాన్తో మ్యాచ్లో అతడిని 3వ స్థానంలో బ్యాటింగ్కు పంపాను. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రపంచ క్రికెట్లో అతనొక అత్యుత్తమ ఆటగాడే కాదు. మంచి ఫినిషర్ కూడా. ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు జట్టును గెలిపించాలనే ఉత్సాహంతో చాలా మంది ఆటగాళ్లు ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ, ధోనీ మాత్రం ఒత్తిడిని జయించి ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు. అదే ఎంఎస్ ధోనీ ప్రత్యేకత. అందుకే నేను మహీకి ప్రియమైన అభిమానిగా మారిపోయాను’ అని గంగూలీ చెప్పాడు.