కులనిర్మూలనకు పూలే రాజీలేని పోరాటం

by  |
కులనిర్మూలనకు పూలే రాజీలేని పోరాటం
X

దిశ, మెదక్: మహాత్మ జ్యోతిరావు ఫూలే 193వ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.తిరుపతిరెడ్డి, కార్యదర్శి కనకయ్య మాట్లాడుతూ… కులనిర్మూలన కోసం రాజీలేని పోరాటం చేసి, బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేసిన సామాజిక విప్లవకారుడు పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పొనమల్ల రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ విజేందర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జానకిరాములు, పద్మయ్య, జిల్లా కార్యదర్శి జి.శివాజీ, నాయకులు గోపాల్ రెడ్డి, పి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Tags: Jyotirao Phule, Jayanti, Program, medak, tptf union leaders



Next Story