‘మహాసముద్రం’ ప్రయాణం మొదలు

by  |
‘మహాసముద్రం’ ప్రయాణం మొదలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది. శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్ మూవీ ‘మహాసముద్రం’ చిత్రీకరణ ప్రారంభించినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా.. ముహూర్తం షాట్ పిక్చర్ షేర్ చేశారు. బౌండెడ్ స్క్రిప్ట్, టాలెంటెడ్ యాక్టర్స్‌తో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు జర్నీ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. మహాసముద్రం థీమ్ ఫొటోకు ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ రాగా.. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది .సినిమా.

Next Story