మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు కరోనా

by  |
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సోమవారం కరోనా బారిన పడ్డారు. ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్ తేలింది. కానీ, ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. ముందు జాగ్రత్తగా వైద్యుల సూచనల మేరకు బ్రీచ్ క్యాండి హాస్పిటల్‌లో చేరాను’ అని ట్వీట్ చేశారు. పార్టీ వర్కర్లు, పౌరులు తన ఆరోగ్యం గురించి చింతించవద్దని, త్వరలోనే మళ్లీ తిరిగి వస్తారని పేర్కొన్నారు. గురువారం టెస్టు చేయించుకోగా తనకు నెగెటివ్ వచ్చింది. కానీ, ముందుజాగ్రత్తగా హోం క్వారంటైన్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed