121మంది పోలీసులకు కరోనా పాజిటివ్

by  |
121మంది పోలీసులకు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. అక్కడ రోజుకూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 4లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దేశంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి మొదలు.. ప్రజా ప్రతినిధుల వరకు అందరూ కరోనాకు దాసోహం అంటున్నారు.

ఆ రాష్ట్రంలో ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులకు కరోనా ఫీవర్ పట్టుకుంది. గడిచిన 24 గంటల్లో 121 మంది పోలీస్ సిబ్బందికి కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన పోలీస్ సిబ్బంది సంఖ్య 9 వేలకు చేరింది. వీరిలో కరోనా నుంచి కోలుకుని 7,176 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,939 యాక్టివ్ కేసులు ఉన్నాయి.కాగా, ఇప్పటి వరకు కరోనా బారినపడి 102 మంది మరణించారు.

Next Story

Most Viewed