- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకు రెండోసారి కరోనా సోకడం గమనార్హం. సోషల్ జస్టిస్ మినిస్టర్గా ఉన్న ధనంజయ్.. గతేడాది జూన్లో కూడా కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా తనకు మరోసారి కరోనా సోకినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయినవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.
సీఎం భార్యకూ కరోనా..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే భార్య రష్మి థాక్రే కు కొవిడ్ నిర్ధారణ అయింది. పది రోజుల క్రితమే ఆమె తన భర్తతో కలిసి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె హోంక్వారంటైన్లో ఉన్నారు. నాలుగు రోజుల క్రితమే ఉద్ధవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రేకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.
Next Story