పోటీపడుతున్న కరోనా కేసులు.. లాక్ డౌన్ విధించిన సీఎం

by  |
Corona virus
X

దిశ,వెబ్‌డెస్క్: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరో సారి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యల్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మహరాష్ట్రలోని అమరావతి జిల్లాలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎ ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.

నెలరోజుల నుంచి అమరావతి జిల్లాలో కేసులు పెరిగిపోతుండడంతో సీఎం ఉద్ధవ్ థాకరే ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 22వరకు సాయంత్రం 8గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7గంటల వరకు లాక్‌డౌన్ విధించినట్లు జిల్లా వైద్యాశాఖ అధికారి డాక్టర్ దిలీప్ తెలిపారు.

‘నెల రోజుల నుంచి రోజుకి 70కేసులు తగ్గకుండా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇంకా ఎక్కవ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలోనే అమరావతి కార్పొరేషన్ లో ముంబై, పూణే, నాగపూర్ లలో ఆదివారం రోజు కొత్తగా 430 మందికి వైరస్ సోకింది’. అందుకే లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ దిలీప్ చెప్పారు.

Next Story

Most Viewed