- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముంబై: నిసర్గ తుఫాన్తో నష్టపోయిన రాయ్గడ్ జిల్లాకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రూ. 100 కోట్ల తక్షణ సహాయాన్ని ప్రకటించారు. నిసర్గ తుఫాన్ వల్ల అతలాకుతలమైన రాయ్గడ్ జిల్లాలో పర్యటిస్తూ సీఎం ఈ ప్రకటన చేశారు. ఆ జిల్లా అలీబాగ్ తాలూకాలో పర్యటించిన సీఎం రాయ్గడ్కు తక్షణ సహాయంగా రూ. 100 కోట్లను అందిస్తున్నట్టు తెలిపారు. అయితే, దీంతో సహాయానికి ఫుల్స్టాప్ పెట్టినట్టు కాదనీ, నష్ట అంచనాలు జరుగుతున్నాయని, అనంతరం తగినమొత్తంలో సహాయాన్ని ప్రకటిస్తారని వివరించారు. రాయ్గడ్ జిల్లాలాగే ఇతర జిల్లాలకూ సహాయం అందుతుందని తెలిపారు. ముంబైని వదిలేసిన నిసర్గ తుఫాన్ రాయ్గడ్ సహా పలు జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చెట్లు, కరెంట్ పోల్స్ పెకిలి వచ్చాయి. ఆరుగురు చనిపోయారు. ఈ తుఫాన్ కారణంగా మరణించినవారి కుటుంబ సభ్యులకు నాలుగు లక్షల పరిహారాన్ని అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.