జూలై 25 నుంచి మహంకాళి బోనాలు..

by  |
balwanth Yadav
X

దిశ, చార్మినార్ : ఆషాడ మాసం పాతనగర బోనాల జాతర ఉత్సవాలు జూలై 25 నుంచి ప్రారంభం కానున్నట్లు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ బల్వంత్ యాదవ్ తెలిపారు. గురువారం మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయంలో ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీరాలం మండి మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య.. నూతనంగా ఎన్నికైన ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు బల్వంత్ యాదవ్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

Next Story

Most Viewed