రాత్రంతా నిరీక్షణ.. అడ్రస్ లేని కిడ్నాపర్లు

by Batti.Sumithra |   (  Updated:2020-10-21 22:31:07  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్‌లో కిడ్నాపైన విలేకరి కుమారుడి మిస్టరీ వీడడం లేదు. పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా.. కిడ్నాపర్ల ఆచూకీ లభించడం లేదు. దీంతో కిడ్నాపర్లు డిమాండ్ చేసిన మేరకు రూ.45 లక్షలతో బాలుడి తండ్రి ఎదురుచూస్తున్నారు. మొత్తం ఇప్పటివరకూ 11 సార్లు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేశారు. దీంతో నగదుతో నిన్నటినుంచి రోడ్డుపైనే తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కాగా పోలీసులు ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం మూడు కోట్ల సెంటర్ [&hellip;]</p>

రాత్రంతా నిరీక్షణ.. అడ్రస్ లేని కిడ్నాపర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్‌లో కిడ్నాపైన విలేకరి కుమారుడి మిస్టరీ వీడడం లేదు. పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా.. కిడ్నాపర్ల ఆచూకీ లభించడం లేదు. దీంతో కిడ్నాపర్లు డిమాండ్ చేసిన మేరకు రూ.45 లక్షలతో బాలుడి తండ్రి ఎదురుచూస్తున్నారు. మొత్తం ఇప్పటివరకూ 11 సార్లు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేశారు. దీంతో నగదుతో నిన్నటినుంచి రోడ్డుపైనే తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

కాగా పోలీసులు ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం మూడు కోట్ల సెంటర్ నుంచి మరో చోటుకు రావాలని కిడ్నాపర్లు చెప్పడంతో బాలుడి తండ్రి క్యాష్ బ్యాగ్‌తో వెళ్లారు. రాత్రి నుంచి నిరీక్షణ చేస్తున్నా.. కిడ్నాపర్ల నుంచి ఇప్పటివరకూ మళ్లీ ఫోన్ రాలేదు. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Next Story