జంషెడ్‌పూర్‌పై కేరళ బ్లాస్టర్స్ విజయం

by  |
జంషెడ్‌పూర్‌పై కేరళ బ్లాస్టర్స్ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి తిలక్ మైదాన్ స్టేడియంలో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ 3-2 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత 22వ నిమిషంలో కేరళ స్ట్రైకర్ కోస్టా నమోయిస్ తొలి గోల్ సాధించి కేరళ బ్లాస్టర్స్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఇక 36వ నిమిషంలో జెంషెడ్ పూర్ ఆటగాడు నెర్జిస్ వాల్‌స్కిస్ గోల్ కొట్టి స్కోర్‌ను 1-1 సమం చేశాడు. తొలి అర్ద భాగం ముగిసే సరికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి. రెండో అర్ధభాగంలో ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. అయితే కేవలం 5 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ స్కోర్ అయ్యాయి. 79, 82వ నిమిషంలో కేరళ ఆటగాడు జోర్డాన్ ముర్రే వరుసగా గోల్స్ చేసి కేరళ ఆధిక్యాన్ని 3-1కి తీసుకెళ్లాడు. అయితే 84వ నిమిషంలో నెర్జిస్ వాల్‌స్కిస్ మరో గోల్ చేసి జంషెడ్‌పూర్‌కు మరో గోల్ అందించాడు. ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. దీంతో కేరళ బ్లాస్టర్స్ జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది. ఫకాండో పేరియాకు డీహెచ్ఎల్ విన్నింగ్స్ పాస్ అవార్డు, జోర్డాన్ ముర్రేకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

అంతకు ముందు జీఎంసీ స్టేడింయలో చెన్నియిన్ ఎఫ్‌సీ, ఒడిషా ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు నిర్ణీత సమయం లోపు గోల్స్ చేయడానికి తీవ్రంగా శ్రమించినా విఫలం అయ్యాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రేగన్ సింగ్ డీహెచ్ఎల్ విన్నింగ్స్ పాస్ ఆఫ్ ది మ్యాచ్, లాలాయంన్జులాకు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


Next Story

Most Viewed