ఆ రాష్ట్ర మంత్రికి క‌రోనా పాజిటివ్‌..

by  |
ఆ రాష్ట్ర మంత్రికి క‌రోనా పాజిటివ్‌..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, పోలీసులు, వైద్య సిబ్బంది, ప‌లువురు ప్ర‌ముఖ‌ న‌టులు కూడా వైరస్ బారిన పడ్డారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ కేబినెట్ మంత్రికి క‌రోనా సోకింది. బుధవారం రాత్రి రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో పాల్గొన్న ఆయన అలాగే, గ‌వ‌ర్న‌ర్ లాల్జీ టాండ‌న్ చివ‌రి క‌ర్మ కార్య‌క్ర‌మానికి కూడా హాజ‌ర‌య్యారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎవ‌రెవ‌రితో కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా వైద్యులు టెస్టులు చేస్తున్నారు. కేబినెట్ మంత్రి ప్రస్తుతం భోపాల్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలాఉండగా, భోపాల్‌లో రేప‌టి నుంచి 10 రోజుల పాటు మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌నుంది.

Next Story

Most Viewed