తిరుగుబాటు మంత్రుల తొలగింపు

by  |
తిరుగుబాటు మంత్రుల తొలగింపు
X

భోపాల్: మధ్యప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా సహా మరో 19మంది ఎమ్మెల్యేలు హస్తానికి హ్యాండిచ్చారు. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం పార్టీలో చేరనున్నట్టు సింధియా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తిరుగుబాటు మంత్రులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు లేఖ రాశారు. కాగా, రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం బెంగళూరు రిసార్ట్స్‌లో ఉన్నారు.

Next Story

Most Viewed