మాధురి పాటకు దేశం ఫిదా..

by  |
మాధురి పాటకు దేశం ఫిదా..
X

బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది తన డ్యాన్స్. ఫుల్ గ్రేస్‌తో స్టెప్పులేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే మాధురికి దేశవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ డ్యాన్స్ క్లాసులు చెప్పడం షురూ చేసిన ఈ సీనియర్ హీరోయిన్.. సింగర్‌గానూ అదరగొడుతోంది. తాజాగా కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ క్యాండిల్ పేరుతో ఓ సాంగ్ రిలీజ్ చేసింది. ‘కొవ్వొత్తిలా ప్రకాశవంతంగా వెలుగుతూ.. కరోనా కారణంగా ఏర్పడిన ఆపద సమయం నుంచి అందరం కలిసి బయటపడాలని’ ఈ పాట ద్వారా కోరుకున్నారు.

కాగా, మాధురి ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రశంసలు జల్లు కురుస్తోంది. ‘పాటకు తన వాయిస్, అందుకు తగిన లిరిక్స్ చక్కగా కుదిరాయంటున్న ఫ్యాన్స్.. టాలెంట్‌తో మమ్మల్ని ఎప్పుడూ సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటారు’ అంటూ మాధురిని అభినందిస్తున్నారు. ‘కొంచెం ఆనందం, మరికొంత భయంతో.. ఈ పాట మీకు నచ్చుతుందని నమ్ముతూ విడుదల చేస్తున్నాను’ అని మాధురి తెలపగా.. ‘మీరు లెజెండ్ మేడమ్.. మీకెప్పుడూ భయపడాల్సిన అవసరం లేదంటూ’ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

Next Story

Most Viewed