మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య మృతి

by  |
మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

వెంకటనర్సయ్య మధిర అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అదీ నుంచి ముక్కుసాటిగా వ్యవహరించే నర్సయ్య 2009 శాసనసభ ఎన్నికలకు ముందు సొంత పార్టీపై తిరుబావుటా ఎగరేశారు. పార్టీ విధానాలు, రాష్ట్ర అగ్రనాయకత్వం తీరు నచ్చక సీపీఎం నుంచి వైదొలగిన ఆయన.. గడువుకు ముందే తన శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

కట్టా వెంకట నర్సయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జీవితాంతం తాను నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడిన వ్యక్తిగా వెంకట నర్సయ్యను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని సీఎం కేసీఆర్ అన్నారు. యుక్త వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి.. ప్రజల బాగుకోసం పాటుపడిన వెంకట నర్సయ్య ఎందరికో ఆదర్శప్రాయుడిని నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు సీపీఎం జిల్లా నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed