గుంటూరు అమ్మాయిలతో లగ్జరీ వ్యభిచారం..

by  |
Luxury prostitution
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉద్యోగులు ఉండే కాలనీలో లగ్జరీ ప్లాట్ అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా బిజినెస్ చేస్తోందీ ఓ కిలాడీ జంట. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు నగరంలోని మాధవీనగర్ స్టేట్ బ్యాంక్ కాలనీలో డోన్‌ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, కీర్తి కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడికి గుంటూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గత కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని స్థానికులు గుర్తించారు. ప్రతిరోజు కొత్త వ్యక్తులు వచ్చి వెళ్తుండడంతో అనుమానించిన కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కర్నూలు త్రీటౌన్ పోలీసులు సోమవారం వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఆ సమయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు, విటుడు జాకీర్ హుసేన్, కొంతమంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువతులకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విటుడు, వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కాగా, ప్రధాన సూత్రదారిలో ఒకరైన కీర్తి పరారీ ఉన్నది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story