గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంపు

by  |
గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంపు
X

న్యూఢిల్లీ: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 14.2 కిలోల సిలిండర్‌పై ఢిల్లీలో ఆదివారం రూ. 50 పెరిగింది. సోమవారం నుంచి సిలిండర్ ధర రూ. 769కి చేరనుంది. ఈ నెలలో ఎల్‌పీజీ గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. రాయితీయేతర గ్యాస్ సిలిండర్‌లపై ఈ నెల 4న నాలుగు మెట్రో సిటీల్లో రూ. 25 చొప్పున పెరిగింది. ఒకవైపు పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ సామాన్యుల నడ్డి విరిచేలా గ్యాస్ మొద్దు ధర పెరిగింది. వరుసగా ఆరో రోజూ నాలుగు ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు పెరిగాయి. సుమారు 30 పైసల పెంపుతో ఆల్ టైం రికార్డు ధరలతో పెట్రోలు, డీజిల్ ఇంధనాలు దూసుకుపోతున్నాయి.



Next Story

Most Viewed