లాడ్జిలో లవర్స్.. వారిని ఆ స్థితిలో చూసి పోలీసులు షాక్!

by  |
Lovers in lodge
X

దిశ, వెబ్‌డెస్క్ : యువత ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో అంచనా వేయడం కష్టం. ఇప్పటి జనరేషన్‌ను మరీనూ. ఆకస్మిక నిర్ణయాలతో అందరిని విస్మయానికి గురి చేస్తుంటారు. మంచి ఎంత చేస్తారో చెడును కూడా అదే తీరుగా చేస్తుంటారు. ఇక ప్రేమ, పెళ్లి సహజం అయిపోయాయి. ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. ఇద్దరు ప్రేమికులు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌లోకి నెట్టారు.

కుమిలి పట్టణానికి చెందిన ధనుష్ (24), అభిరామి (20) గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లోనూ తెలిసినా పిల్లల నిర్ణయాన్ని కాదనలేక పోయారు. అయితే ప్రేమికులు ఇద్దరు కలిసి పట్టణంలోని ఓ లాడ్జిలో రూం తీసుకుని గడిపారు. అనంతరం తామిద్దరం చనిపోతున్నామని స్నేహితులకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్లు ప్రేమికులకు నచ్చజెప్పుతూనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ వారిద్దరు ఉన్న లాడ్జి అడ్రస్ తెలుసుకుని వెళ్లేలోపే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులకు లాడ్జిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. మరోవైపు ఎలాంటి సమస్యలు లేని ప్రేమికులు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారో తెలియక తల్లిదండ్రులు, మిత్రులు విషాధంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమికుల ఆత్మహత్య మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు.

Next Story

Most Viewed