‘లవ్ జిహాద్ వాస్తవమే.. భారత్‌ను ముస్లిం దేశంగా మార్చే కుట్ర’

by  |
‘లవ్ జిహాద్ వాస్తవమే.. భారత్‌ను ముస్లిం దేశంగా మార్చే కుట్ర’
X

దిశ, వెబ్‌డెస్క్ : లవ్ జిహాద్ వంటిది ఏదీ లేదని కోర్టులు చెబుతున్నా.. తాను మాత్రం అది ఉన్నదని నమ్ముతున్నానని కేరళ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ‘కేరళ జనపక్షం పార్టీ’కి చెందిన ఎమ్మెల్యే పి.సి. జార్జ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ముస్లిం దేశంగా మార్చే కుట్ర జరుగుతున్నదని.. అలా కాకుండా ఉండాలంటే భారత్‌ను తక్షణమే ‘హిందూ దేశం’గా ప్రకటించాలని కోరారు. కేరళలోని ఇడుక్కి జిల్లా తొడుపుజలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

జార్జ్ మాట్లాడుతూ.. ‘లవ్ జీహాద్ అనేది లేదని సుప్రీంకోర్టు చెబుతున్నా గానీ అది ఉందని నేను నమ్ముతున్నాను. 2030 వరకు ముస్లిములు ఈ దేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలని ప్రణాళికలు రచించారు. కానీ ప్రధాని మోడీ నోట్లరద్దు ప్రకటన కారణంగా అది కాస్తా వాయిదా పడింది’ అని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రజల్లో అనుమానాలు, అపోహలు తలెత్తకముందే భారత్‌ను హిందూ రాష్ట్రగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.. అంతేగాక క్రిస్టియన్ దేశాలుగా పిలువబడుతున్న దేశాలలోకి వెళ్లి వాటిని ఇస్లామిక్ దేశాలుగా మార్చే కుట్ర కూడా జరుగుతున్నదని.. కొద్దిరోజులుగా అమెరికా, ఫ్రాన్స్ లో జరుగుతున్న మారణకాండ దానికి సాక్ష్యం అని తెలిపారు.


Next Story

Most Viewed