ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. చివరికి వారిది ఆ సంబంధం అని తెలిసి

by  |
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. చివరికి వారిది ఆ సంబంధం అని తెలిసి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నెహ్రూనగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బోడ శ్వేత (20) , గుగులోత్ వెంకటేశ్ గత కొన్నేండ్ల నుంచి ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్నారు. అయితే చివరికి వారిద్దరిది అన్నాచెల్లెళ్ల వరస అని తెలిసి మనస్థాపంతో మంగళవారం ఉదయం ఇద్దరు ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడు. యువకుని పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని ఖమ్మంలోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed