- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, పటాన్ చెరు: కంకర టిప్పర్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన డ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని రుద్రారం గ్రామం అంబేద్కర్ కాలనీకి చెందిన ఆంజనేయులు కుమారుడు నితిన్ (17) పదవ తరగతి పూర్తయిన తర్వాత ఇంటి వద్దనే ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో క్రికెట్ ఆడేందుకు స్నేహితులతో బయటికి వెళ్లాడు.
ఫోన్ మరచిపోవటంతో స్నేహితుని బైకు తీసుకొని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని ధోని ప్రభుత్వ పాఠశాల ముందు జాతీయ రహదారి గీతం యూటర్న్ దగ్గర బైకు స్లో చేసుకోగా పటాన్ చెరు వైపు నుంచి వెళ్తున్న కంకర టిప్పర్ లారీ వెనుక నుంచి వేగంగా బైకును ఢీ కొనడంతో నితిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ టిప్పర్ను వదిలి పారిపోయాడు. మృతుడి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ సాయిలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.