- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మక్తల్ : పోలీస్ అవుట్ పోస్టులోకి ప్రమాదవశాత్తు లారీ దూసుకెళ్లిన ఘటనలో డ్రైవర్ దిల్షాద్ (40) మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక సరిహద్దు రాయచూరు జిల్లా శక్తినగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది.
ఎస్సై ఉలిగేష్ కథనం ప్రకారం.. హోస్పెట్ నుంచి హైద్రాబాద్కు మైనింగ్ లోడుతో వస్తున్న లారీ ఈరోజు తెల్లవారు జామున శక్తినగర్ పోలీసు ఔట్ పోస్టులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినపుడు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నట్టు సమాచారం. ఆ సమయంలో పోలీసు అవుట్ పోస్టులో ఎవరూ విధుల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
లారీ నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచూరు ఆస్పత్రికి తరలించారు.