లారీ వెనుక నుంచి ఢీకొన్న బైక్.. బొగ్గు గని వర్కర్ మృతి

by  |
accident-at-manuguru1
X

దిశ, బూర్గంపాడు: పొగమంచు కారణంగా ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద పాల్వంచ వైపు వెళ్తున్న బొగ్గు లారీ రోడ్డుపై ఆగి ఉంది. ఇదే క్రమంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న మణుగూరుకు చెందిన మడిపల్లి వెంకటేశ్వర్లు పొగమంచు కమ్ముకోవడంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు మణుగూరు బొగ్గు గనిలో ప్రైవేట్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. బూర్గంపాడు ట్రైనీ ఎస్ఐ విజయలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed