అంబానీకి కోర్టు వార్నింగ్.. బాకీ కడతావా.. జైలు కెళ్తావా?

by  |
అంబానీకి కోర్టు వార్నింగ్.. బాకీ కడతావా.. జైలు కెళ్తావా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 20లోపు ఆదాయ, వ్యయాల వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. లేదంటే ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపింస్తామంటూ హెచ్చరించింది. లక్ష డాలర్లకు పైగా విలువ ఉన్న అన్ని ఆస్తుల వివరాలను వెల్లడించాలని అంబానీకి స్పష్టం చేసింది.

భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీ తమకు రూ.5,354 కోట్లు బాకీ పడ్డారంటూ మూడు చైనా బ్యాంకులు లండన్‌లోని మాస్టర్ డేవిసన్ కమర్షియల్ కోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన కోర్టు అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది మే నెలలోనే బ్యాంకులకు అప్పులను చెల్లించాలంటూ జస్టిస్ నిగెల్ టియర్ తీర్పునిచ్చారు. అయితే, ఆర్‌‌కామ్ కోసం అంబానీ పర్సనల్ గ్యారంటీ ఇచ్చి, 900 మిలియన్ డాలర్ల అప్పు తీసుకున్నారని బ్యాంకులు ఆరోపించాయి. ఈ ఆరోపణలను ఖండించిన అనిల్.. బాకీ చెల్లించే స్తోమత లేదని వాదిస్తున్నారు. 2008 వరకు ఇండియాలోనే ఆరో పెద్ద సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. ప్రస్తుతం తన నెట్‌‌వర్త్ విలువ సున్నాకు చేరిందని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆడిట్ అఫిడవిట్‌ను కోర్టుకు అందజేశారు. అయితే, కోర్టు మాత్రం అంబానీ వాదనతో విబేధిస్తూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వెంటనే కట్టాలని ఆదేశించింది.

Next Story

Most Viewed