టీ.కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల.. భువనగిరి బరిలో కీలక నేత

by Disha Web Desk 2 |
టీ.కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల.. భువనగిరి బరిలో కీలక నేత
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశం ముగిసింది. ఢిల్లీలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగింది. మొత్తం 14 స్థానాలపై కసరత్తు పూర్తి చేశారు. అనంతరం అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. ఇందులో తెలంగాణకు చెందిన వారు నలుగురు ఉన్నారు. భువనగిరి అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ అభ్యర్థిగా టీ.జీవన్ రెడ్డి, మెదక్ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్, ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సుగుణను ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించారు.





Next Story

Most Viewed