బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎనిమిదో జాబితా విడుదల

by Disha Web Desk 12 |
బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎనిమిదో జాబితా విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి భారీ మెజారిటే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో పొత్తులో భాగంగా ఆయా పార్టీలతో కొలిక్కి వచ్చిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తుంది. ముఖ్యంగా ఏడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు అనుగుణంగా.. దశల వారీగా అభ్యర్థులను బీజేపీ ప్రకటిస్తుంది. తాజాగా ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 9 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో.. గురుదాస్‌పూర్‌ నుంచి దినేష్‌ సింగ్‌ 'బబ్బు', అమృత్‌సర్‌ నుంచి తరంజిత్‌ సింగ్‌ సంధు, జలంధర్‌ నుంచి సుశీల్‌ కుమార్‌ రింకూ, ఫరీద్‌కోట్‌ నుంచి హన్స్‌ రాజ్‌ హన్స్‌, పాటియాలా నుంచి ప్రణీత్‌ కౌర్‌ లకు చోటు దక్కింది.

Next Story

Most Viewed