BJP మేనిఫెస్టో విడుదల.. హైలైట్‌గా పద్నాలుగు కీలక అంశాలు

by GSrikanth |
BJP మేనిఫెస్టో విడుదల.. హైలైట్‌గా పద్నాలుగు కీలక అంశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆదివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపర్చారు. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు, చిరు వ్యాపారులకు మోడీ మేనిఫెస్టోను అందించారు. ఈ మేనిఫెస్టోను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులు ప్రత్యేకంగా రూపొందించారు. దాదాపు 15 లక్షల మంది అభిప్రాయాలను సేకరించారు. మహిళలు, రైతులు, యువత, పేదలే అజెండాగా మేనిఫెస్టోను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.

మేనిఫెస్టోలోని అంశాలు :

1. విశ్వబంధు

2. సురక్షిత భారత్

3. సమృద్ధ భారత్

4. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు

5. జీవన సౌలభ్యం

6. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్

7. సాంస్కృతిక వికాసం

8. గుడ్ గవర్నెన్స్

9. స్వస్థ భారత్

10. అత్యుత్తమ శిక్షణ

11. క్రీడా వికాసం

12. సంతులిత అభివృద్ధి

13. సాంకేతిక విసాకం

14. సుస్థిర భారత్



Next Story

Most Viewed