- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో కరోనా బాధితులు పడుతున్న బాధలు చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. నెల్లూరులో టాయ్లెట్లో పడి కరోనా రోగి మృతిచెందడం విచారకమన్నారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఈ ఒక్క సంఘటన ఒక్కటి చాలు.. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొవడానికి ప్రభుత్వం ఎంత అధ్వానమైన చర్యలు తీసుకుంటుందో అని విమర్శించారు. సీఎం జగన్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. క్వారంటైన్ సెంటర్లలో వసతులు శూన్యమని, ఆసుపత్రుల్లో సరైన వైద్యం కూడా అందడం లేదని ఆయన తప్పబట్టారు. ‘జగన్ గారు కరోనా అంటే మీకు పెద్ద విషయం కాకపోవచ్చు.. కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యమని’ గుర్తు చేశారు.
Next Story