రేపు ఏపీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన

by  |
om-birla
X

దిశ, ఏపీ బ్యూరో: నేడు చిత్తూరు జిల్లాలో లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా పర్యటించనున్నారు. రెండు రోజులపాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. మ.1.30 గం.కు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గం.కు తిరుమల చేరుకుంటారు. 5.30 గం.కు వైకుంఠద్వార దర్శనం చేసుకొని, తిరుమల శ్రీకృష్ణ వసతిగృహంలో రాత్రికి స్పీకర్ ఓం బిర్లా బస చేయనున్నారు. మంగళవారం ఉదయం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం పద్మావతి వసతిగృహంలో టీటీడీ అధికారులతో సమీక్షలో పాల్గొంటారు.

Next Story