చేవెళ్లలో లోక్ అదాలత్.. 138 కేసుల పరిష్కారం

by  |
Jadji1
X

దిశ, చేవెళ్ల: జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం చేవెళ్ల కోర్టులో లోక్ అదాలత్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి జీవన్ సూరజ్ సింగ్, చేవెళ్ల కోర్టు జడ్జి స్వాతి మురారి మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కరమవుతాయన్నారు. మొత్తం కేసులు138 పరిష్కరించామన్నారు. చేవెళ్ల -43, శంకర్ పల్లి -51, షాబాద్ -29, ఎక్సైజ్ -11, సివిల్ -03, డివిసి -01 కేసులు పరిష్కరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల బార్ ప్రసిడెంట్ పి.మధుసూదన్ రెడ్డి, జి. పాండు రంగారెడ్డి, లీగల్ హెడ్ బి. సురేష్, బాలస్వామి, ఎక్సైజ్ సీఐ, శంకర్ పల్లి సీఐ, షాబాద్ సీఐ, కోర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed